
- నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త నాగరాజు ఫిర్యాదుతో శనివారం రాత్రి పోలీసులు నిందితుల్లో 8 మంది మహిళలు, 6 గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
అసభ్యకరంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఐటీ చట్టంతో పాటు 16 సెక్షన్లు కింద కేసు ఫైల్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి బాధిత మహిళకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ప్రాణభయంతో పారిపోయిన బాధితురాలి ఆచూకీని పోలీసులు కనుగొని..ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిసింది.