దిగ్విజయ్ సింగ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

దిగ్విజయ్ సింగ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. MIM నేత హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరు కాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. 2016లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ MIM నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్‌ అన్వర్‌ స్థానిక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్‌ వారెంట్‌జారీ అయ్యింది.

అయితే, అనారోగ్యం కారణంగా విచారణకు మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను తోసిపుచ్చిన ప్రజాప్రతినిధుల కోర్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.