క్యాతనపల్లి, నస్పూర్ లలో సింగరేణి ఉద్యోగులకు పెరగని హెచ్ఆర్ఏ
రామకృష్ణాపూర్,వెలుగు: రెండేళ్ల కిందటే మున్సిపాలిటీలుగా మారినా వాటి పరిధిలోని సింగరేణి ఉద్యోగులకు కొత్త హెచ్ఆర్ఏ అందడంలేదు. పాత మున్సిపాలిటీ ఏరియాల్లో ఇస్తున్నట్టు తమకు హెచ్ఆర్ఏ పెరుగుతుందన్న ఆశ నెరవేరలేదు. సింగరేణి పరిధిలోని క్యాతన్పల్లి, నస్పూర్ రెండేళ్ల కింద మున్సిపాలిటీలయ్యాయి. మున్సిపాలిటీల పరిధిలోని కార్మికులకు, ఉద్యోగులకు సింగరేణి 10శాతం హౌజ్ రెంట్ అలవెన్సు ఇవ్వాల్సిఉండగా.. క్యాతనపల్లి, నస్పూరులలో మాత్రం ఇంకా అలవెన్సు పెంచలేదు. క్వార్టర్సౌకర్యంలేని కార్మికులకు నెలకు రూ.150 మాత్రమే హెచ్ఆర్ఏ కింద ఇస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో నివసించే బొగ్గు గనుల ఉద్యోగులకు, కార్మికులకు యాజమాన్యం క్వార్టర్ సౌకర్యం ఇవ్వకుంటే 10 శాతంహెచ్ఆర్ఏగా చెల్లించాలని బొగ్గు గని కార్మికుల వేజ్బోర్డు నిర్ణయించింది. గత ఏడాది నుంచి 8శాతం ఇస్తున్నారు. 2018 ఆగస్టు 1న కోల్బెల్ట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో క్యాతన్పల్లి, నస్పూర్ లను ప్రభుతకవం మున్సిపాలిటీలుగా చేసింది. అంతకు ముందు జిల్లాలోని సింగరేణి ఏరియాలో మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ ఉంటున్న సింగరేణి ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం 8శాతం హెచ్ఆర్ఏ అమలు చేస్తోంది. రెండేళ్లనుంచి తమకు 10 శాతం హెచ్ఆర్ఏ రావాల్సిఉండగా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఈ పట్టణాలకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేజ్బోర్డ్ అగ్రిమెంట్ ప్రకారం హెచ్ఆర్ఏ పెంచి ఇవ్వాలని కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి.
బొగ్గు గనులన్నీ మున్సిపాలిటీల పరిధిలోకి ….
ఆర్కే-1ఏ బొగ్గు గని, ఆర్కేపీ ఓపెన్కాస్ట్, సింగరేణి ఏరియా ఆసుపత్రి, ఆర్కేపీ సీహెచ్పీ, రీజినల్ అనాలటికల్ ల్యాబ్, సివిల్, హెల్త్ విభాగాలు, ఆర్అండ్ డీ డిస్పెన్సరీ, రాజీవ్చౌక్ డిస్పెన్సరీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. జైపూర్ మండలం ఇందారం- 1ఏ బొగ్గు గని మినహా మిగిలిన శ్రీరాంపూర్ ఏరియాలోని ఏడు అండర్ గ్రౌండ్ మైన్స్, ఒక ఓసీపీతో పాటు డిపార్ట్మెంట్లు , ఆఫీసులన్నీ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. వీటిలో క్వార్టర్ సౌకర్యంలేని 7వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగులకు బేసిక్ సాలరీ పై 8శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలి. సింగరేణిలో రూ.26వేల నుంచి రూ.70వేల వరకు బేసిక్ సాలరీ ఉంటుంది. అంటే నెలకు ఒక్కో ఉద్యోగికి రూ.2080 నుంచి రూ.5,600 వరకు చెల్లించాలి. క్యాతన్పల్లి, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో క్వార్టర్ సౌకర్యం లేని సుమారు 7వేలు మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అందడంలేదు. వీరితో పాటు పాత మున్సిపాలిటీలైన చెన్నూరు, లక్షెట్టిపేట పరిధిలోని మైన్స్లో పనిచేసే మరో 1500 మంది ఉద్యోగులకు కూడా పెంచిన హెచ్ఆర్ఏ అమలు కావడంలేదు. 8,500 మంది ఉద్యోగులు నెలకు సగటున రూ.3,500 చొప్పున రూ.2.97కోట్లు కోల్పోతున్నారు. ఈ లెక్కన ఉద్యోగులు రెండేళ్లలోరూ.71 కోట్లను నష్టపోయారు.
10 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలి
శ్రీరాంపూర్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు 10 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం దీక్షలను ఏఐటీయూసీ జనరల్సెక్రెటరీ వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ప్రారంభించారు. మొదటి రోజు దీక్షలో ఎస్ఆర్పీ-1 కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు బాజీసైదా, ముస్కె సమ్మయ్య, మేకల దాసు, కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్, బ్రాంచి సెక్రెటరీ కొట్టె కిషన్రావు, నాయకులు వేణుమాధవ్, జోగుల మల్లయ్య, నర్సింగరావు, లింగం రవి, దాడి రాజయ్య, కారుపాక మొగిలి, వేణు పాల్గొన్నారు.