10లక్షలు కాదు.. కోట్లిచ్చినా టీఆర్ఎస్ కు ఓటేయం

10లక్షలు కాదు.. కోట్లిచ్చినా టీఆర్ఎస్ కు ఓటేయం
  • మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

కరీంనగర్: 10 లక్షలు కాదు.. పది కోట్లు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా నాయకురాలు బోడిగె శోభ స్పష్టం చేశారు. తానే కాదు.. తమ దళిత జాతి ఈటల రాజేందర్ కు మోసం చేయదని, ఆయనకే అండగా ఉంటామని ఆమె తేల్చి చెప్పారు. గురువారం జమ్మికుంటలో బీజేపీ  దళిత మోర్చా సమావేశంలో బొడిగె శోభ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కర్ణాటకకు చెందిన ఎంపీ మునుస్వామి, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇతర నేతలు హాజరయ్యారు. 
ఈ సందర్భంగా బొడిగె శోభ మాట్లాడుతూ తమది జాంబవంతుని జాతి అని గుర్తు చేశారు. సత్యహరిశ్చంద్రుని జాతి మాదని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో మాట తప్పినోన్ని గాడిద కొడుకు అని తిడతారు, దళితుల మూడుఎకరాల ఇస్తానని మాట తప్పిన కేసీఆర్ ను గాడిత కొడుకు అంటే గాడిదలు బాధపడుతాయని ఆమె పేర్కొన్నారు. ఇస్తానన్న పదిలక్షలు ఇవ్వకపోతే నిన్ను నిద్రపోనీయమన్నారు. అందుకే ఈటలను గెలిపిస్తే పదిలక్షలు ఇచ్చేదాకా వదిలిపెట్టకుండా పోరాడుతాడని ఆమె పేర్కొన్నారు.