కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో 1,241 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. రేపే నోటిఫికేషన్

కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో 1,241 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. రేపే నోటిఫికేషన్

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(యూఆర్‌ఎస్‌)లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో మొత్తం 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల  భర్తీకి శనివారం(జూన్ 17) నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

ఇందులో 854 పీజీ సీఆర్‌టీ పోస్టులు కాగా.. 273 సీఆర్‌టీ, 77 పీఈటీ, 12 ఎస్‌ఓ ఖాళీలున్నాయి. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఈ నెల 26 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. https://schooledu.telangana.gov.inలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.