నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్

ఇంటర్​ చదివే విద్యార్థులు సైన్స్‌‌‌‌‌‌‌‌, మాథ్స్‌‌‌‌‌‌‌‌ కోర్సుల్లో ఉన్నత విద్య చదివేందుకు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్‌‌‌‌‌‌‌‌ (నెస్ట్​) ఒకటి. తాజాగా నెస్ట్‌‌‌‌‌‌‌‌-2024 నోటిఫికేషన్​ విడుదలైంది. ఇందులో సక్సెస్​ అయితే  నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ సైన్స్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌(నైసర్‌‌‌‌‌‌‌‌), భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌; యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ముంబయి, డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ అటామిక్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ బేసిక్‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌‌‌‌‌‌‌ (సీఈబీఎస్‌‌‌‌‌‌‌‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు.

 అర్హత:

సైన్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లతో 2022, 2023లో ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​:

పరీక్ష రెండు సెషన్‌‌‌‌‌‌‌‌లలో.. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌ విధానంలో నిర్వహిస్తారు. సెక్షన్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది.  ఒక్కో సెక్షన్‌‌‌‌‌‌‌‌కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌‌‌‌‌‌‌‌లో 20 ప్రశ్నలు అడుగుతారు.

 దరఖాస్తులు:

ఆన్​లైన్​లో మే 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష జూన్‌‌‌‌‌‌‌‌ 30న నిర్వహిస్తారు. జనరల్‌‌‌‌‌‌‌‌, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. సమాచారం కోసం www.nestexam.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.