గాంధీలో కొనసాగుతున్న నర్సుల సమ్మె

గాంధీలో కొనసాగుతున్న నర్సుల సమ్మె

పద్మారావునగర్​, వెలుగు: తమను రెగ్యులరైజ్​ చేయాలని, 3 నెలల పెండింగ్​ జీతాలు వెంటనే చెల్లించాలని  గాంధీ ఆస్పత్రిలో సోర్సింగ్ , కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన సమ్మె ఆదివారం15వ రోజుకు చేరింది. ఆస్పత్రి మెయిన్​ బిల్డింగ్​ వద్ద బైఠాయించిన నర్సులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. 

రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్​ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.