పద్మారావునగర్, వెలుగు: తమను రెగ్యులరైజ్ చేయాలని, 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని గాంధీ ఆస్పత్రిలో సోర్సింగ్ , కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన సమ్మె ఆదివారం15వ రోజుకు చేరింది. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ వద్ద బైఠాయించిన నర్సులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక కుటుంబ పోషణ, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.