హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ప్రభాకర్ ఆరోపించారు. ఆ పార్టీ ఆవుదూడ గుర్తును వదులుకుని చేతి గుర్తును ఎంచుకోవడమే అందుకు నిదర్శనమన్నారు.
సోమవారం బీజేపీ స్టేట్ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఓకే చెప్పినా మైనార్టీల మెప్పు పొందేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ను కాంగ్రెస్ వ్యతిరేకించిందని అన్నారు.