అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యం :  ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యం :  ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఉప్పల్ సెగ్మెంట్ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటంతో సెగ్మెంట్​లో ఆయన ప్రచార జోరును పెంచారు. శుక్రవారం కాప్రా డివిజన్ లోని సాయిబాబా కాలనీ, సాయి నగర్, పద్మారావు నగర్, వంపుగూడ, సాకేత్ కాలనీల్లో బీజేపీ నాయకులతో ప్రభాకర్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం జనంలో ఉండే నాయకుడికి వారి సమస్యలపై అవగాహన ఉంటుందన్నారు.

జనాల కష్టసుఖాలు తెలిసిన నాయకుడినే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​కు ఓటేస్తే ఎలాంటి అభివృద్ధి ఉండదన్నారు. తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఉప్పల్ సెగ్మెంట్ రూపురేఖలు మారుస్తానని ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఒకప్పుడు ఇండస్ట్రియల్ హబ్​గా ఉండి ఎంతో మందికి ఉపాధినిచ్చిన ఉప్పల్ సెగ్మెంట్​లో ఇప్పుడు కంపెనీలు లేక  కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.