V6 News

ఈ నెల 23న ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్

ఈ నెల 23న  ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: నదుల అనుసంధానంపై నేషనల్​వాటర్​ డెవలప్​మెంట్​ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) మరోసారి సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 23వ తేదీ ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​పాటిల్ ​నేతృత్వంలో ఇంటర్​ లింకింగ్​లో భాగమైన రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, అధికారులతో 39వ యాన్యువల్​ జనరల్​ మీటింగ్​ (ఏజీఎం), 24వ నదుల అనుసంధాన స్పెషల్​ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు. 

ఈ సమావేశాల్లో గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపైనా చర్చించనున్నారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తే.. జీసీ లింక్​కు ఒప్పుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.