గనుల కేసులో వాయిదాకు రూ.3 వేలు కట్టాలని ఆదేశం

గనుల కేసులో వాయిదాకు రూ.3 వేలు కట్టాలని ఆదేశం

సీబీఐ కోర్టులో అనంతపురం జిల్లా ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనల కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మరోసారి గడువు కోరారు. దర్యాప్తు పూర్తయినట్లు లిఖితపూర్వకంగా తెలపాలని ఇటీవల సీబీఐని హైకోర్టు ఆదేశిందని తెలియజేసిన శ్రీలక్ష్మి. హైకోర్టులో ఈనెల 9న విచారణ ఉన్నందున విచారణ వారం రోజులు వాయిదా వేయాలని శ్రీలక్ష్మి సీబీఐ కోర్టును కోరారు. 
విచారణ పూర్తయిందని గతేడాది అక్టోబరులో దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు కదా అని సీబీఐ కోర్టు ప్రస్తావించింది. మరో రూ.3వేలు చెల్లిస్తే వాదనలు వాయిదా వేస్తామని సీబీఐ కోర్టు శ్రీలక్ష్మికి స్పష్టం చేసింది. గత నెల 29న రూ.వెయ్యి చెల్లించాలని శ్రీలక్ష్మిని సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణలో వాదించకపోతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఓఎంసీ కేసు విచారణ ఈనెల 12కి వాయిదా వేసింది.