ఒడిశా రైలు ఘటనపై ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇవాళ మరోసారి ప్రమాద ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. రైల్వే ట్రాక్ పనులను దగ్గరుండి పరిశీలించారు.
రైలు ప్రమాదానికి గల కారణాన్ని, అందుకు బాధ్యులను గుర్తించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. రైల్వే కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుగుతోందన్నారు.
ప్రమాదంతో దెబ్బ తిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2023 జూన్ 7 బుధవారం ఉదయం లోపు ఈ పనులను పూర్తి చేసి ట్రాక్ పై మళ్లీ రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక ఈ దుర్ఘటనకు కవాచ్తో సంబంధం లేదని రైల్వే మంత్రి వెల్లడించారు.