నెక్స్ట్ మూవీపై మహేశ్ అనౌన్స్ మెంట్ ఇస్తాడా?

నెక్స్ట్ మూవీపై మహేశ్ అనౌన్స్ మెంట్ ఇస్తాడా?

హైదరాబాద్: సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కు రీసెంట్ గా ఆమోదం తెలిపిన సర్కార్.. షూటింగ్స్ కు కూడా పలు ఆంక్షల నడుమ త్వరలోనే అనుమతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో పెద్ద హీరోల నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన ప్రకటనల గురించి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేశ్.. నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ పై ఫ్యాన్స్ తోపాటు ఇండస్ట్రీ వర్గాలూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తండ్రి కృష్ణ బర్త్ డే నాడు ఘట్టమనేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాలని ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ నెల 31వ తేదీతో కృష్ణ 77వ పడిలోకి ప్రవేశించనున్నారు. దీంతో స్పెషల్ అనౌన్స్ మెంట్ గా తదుపరి మూవీ గురించి ప్రకటించే ఆలోచనలో మహేశ్ ఉన్నాడని టాలీవుడ్ టాక్. ఈ సినిమాకు పరశురామ్ డైరెక్టర్ చేయనున్నాడు.

పరశురామ్ తో మహేశ్ చేయనున్న మొదటి ఫిల్మ్ ఇదే కానుంది. గీత గోవిందంతో మంచి పాపులారిటీ సంపాదించిన పరశురామ్ కూడా మహేశ్ లాంటి బిగ్ స్టార్ తో మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాను జీ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలసి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ రూపొందించనున్నాయి. అల వైకుంఠపురం ఫిల్మ్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఎస్ఎస్ థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా మేకర్స్ కన్ఫమ్ చేశారు. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ కు జంటగా నటించిన కియారా అద్వానీ ఈ ఫిల్మ్ లోనూ ప్రిన్స్ పక్కన సందడి చేయనుందని సమాచారం. ఈ మూవీ టైటిల్స్ పై కూడా రకరకాల రూమర్లు వస్తున్నాయి. అందులో ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ట్రేడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.