వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కరిచి ఓ పేషెంట్ చనిపోయిన ఘటన చూశాక కూడా సిటీలోని గాంధీ హాస్పిటల్ మేనేజ్మెంట్లో చలనం రావట్లేదు. నిత్యం వందల మంది పేషెంట్లతో రద్దీగా ఉండే హాస్పిటల్లో కుక్కలు, ఎలుకలు, పంది కొక్కులు తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. మెయిన్ బిల్డింగ్ సెల్లార్లో మురుగు చేరుతుండడంతో ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని పేషెంట్లు, అటెండెంట్లు, సిబ్బంది కోరుతున్నారు.
– వెలుగు, పద్మారావునగర్