గాంధీ ఆస్పత్రిలో ఎలుకలు, కుక్కలు

గాంధీ ఆస్పత్రిలో ఎలుకలు, కుక్కలు

వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కరిచి ఓ పేషెంట్ చనిపోయిన ఘటన చూశాక కూడా సిటీలోని గాంధీ హాస్పిటల్ మేనేజ్​మెంట్​లో చలనం రావట్లేదు. నిత్యం వందల మంది పేషెంట్లతో రద్దీగా ఉండే హాస్పిటల్​లో కుక్కలు, ఎలుకలు, పంది కొక్కులు తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. మెయిన్ ​బిల్డింగ్ సెల్లార్​లో మురుగు చేరుతుండడంతో ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు  వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని పేషెంట్లు, అటెండెంట్లు, సిబ్బంది కోరుతున్నారు.  

 – వెలుగు, పద్మారావునగర్