
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జులై 13, 14 తేదీల్లో జరిగే బోనాలు, రంగం ఉత్సవాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హరిచందన, దేవాదాయ కమిషనర్ ఎస్వెంకట్రావు, అదనపు సీపీ విక్రమ్సింగ్తో కలిసి బోనాల ఏర్పాట్లపై ఆలయంలో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు.
వీఐపీ ప్రోటోకాల్, బారికేడ్లు, నిరంతర విద్యుత్, తాగునీరు, శానిటేషన్, వైద్య శిబిరాలు, పోలీసు భద్రత, ప్రసాద కౌంటర్లు, ఊరేగింపు ఏర్పాట్లలో లోపాలు లేకుండా పక్కాగా చేయాలని సూచించారు. శివసత్తులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 వరకు వచ్చే అవకాశాలు ఉన్నందున సజావుగా అమ్మవారి దర్శనం కల్పించే విధంగా చూడాలని ఆలయ ఈవో మనోహర్రెడ్డికి సూచించారు.
నేడు ఘటోత్సవం
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నేడు ఘటోత్సవం (ఎదుర్కోలు) జరగనుంది. ఆనవాయితీ ప్రకారం ఈ ఘటోత్సవంతో లష్కర్బోనాల ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఆలయ ఈవో మనోహర్రెడ్డి తెలిపారు. వచ్చే నెల 13, 14 తేదీల్లో మహంకాళి బోనాల జాతర జరుగుతుందన్నారు. ఆదివారం జరగనున్న ఘటోత్సవానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ హాజరవుతారన్నారు. జులై 13న వేకువజామున 4 గంటలకు ఈసారి బంగారు బోనాన్ని జిల్లా ఇన్చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు అమ్మవారికి సమర్పిస్తారన్నారు.