అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా.. ఎఫ్ఐఆర్ నమోదు

అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా.. ఎఫ్ఐఆర్ నమోదు

జవహర్ నగర్ లో హెచ్ఎండీఏ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇల్లీగల్ నిర్మాణాలను ఎస్టేట్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం స్థానిక పోలీసుల సహకారంతో సంయుక్తంగా కూల్చివేశాయి. వాటిల్లో మూడు ఇంటి నిర్మాణాలు, ఐదు బేస్మెంట్లతో పాటు కాంపౌండ్ వాల్స్, కరెంటు స్తంభాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) అధికారులు నేలమట్టం చేశారు.

హెచ్ఎండీఏ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో దాదాపు మూడు వేల(3,000) గజాల స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అనంతరం ఈ అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించిన అధికారులు.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.