చెక్ ఇట్ : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

చెక్ ఇట్ : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

ఆయిల్​ కంపెనీలు వాణిజ్య సిలిండర్​ వినియోగదారులకు మరో సారి షాక్​ ఇచ్చాయి. జులై 4న సిలిండర్​ ధరను మరో సారి పెంచి వ్యాపారుల  చెవిన మరో పిడుగులాంటి వార్త వినిపించాయి.  వాణిజ్య సిలిండర్​పై రూ.7 పెంచినట్లు కంపెనీలు తెలపగా.. తాజా నిర్ణయంతో 19 కిలోల సిలిండర్​ ధర ఢిల్లీలో రూ.1,773 నుంచి రూ.1,780 వరకు ఉంది. కోల్​కతాలో రూ.1,902, ముంబయిలో 1,740, చెన్నైలో రూ.1,952 గా ఉన్నాయి. జూన్​లో వాణిజ్య సిలిండర్​పై రూ.83.50 తగ్గించారు. 

Also Read :-గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400

గృహ వినియోగదారులకు ఊరట..

వాణిజ్య సిలిండర్​ ధర పెంచడంతో ఆందోళన చెందిన గృహ వినియోగదారులకు ధర పెంపుదల లేకపోవడంతో ఉపశమనం లభించింది. చివరగా మార్చిలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.50 పెరిగింది. ప్రస్తుతం వీటి ధర ఢిల్లీలో రూ.1,103, కోల్​కతాలో రూ.1,129 గా ఉంది.