తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. "నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి "ఒకే ఒక ఊరిలోనా ఇద్దరంటా" అనే పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించగా.. ఎస్ పీ అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ధనుష్, సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.