భారత హాకీ ప్లేయర్ కేశవ్ చంద్ర మృతి

భారత హాకీ ప్లేయర్ కేశవ్ చంద్ర మృతి

భారత హాకీ ప్లేయర్ కేశవ్ చంద్ర దత్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న 95 ఏళ్ల కేశవ్..ఇవాళ(బుధవారం) కోల్ కతాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

1948 లండన్ ఒలింపిక్స్ తో పాటు 1952 హెల్సింకీ ఇంటర్నేషనల్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన హాకీ జట్టులో కేశవ్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మృతిపై హాకీ ఇండయా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపాయి.