ఓం భీమ్ బుష్ మూవీ మార్చి 22న రిలీజ్

ఓం భీమ్ బుష్ మూవీ మార్చి 22న రిలీజ్

నాలుగేళ్ల క్రితం ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు  ‘ఓం భీమ్ బుష్’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.  ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. మార్చి 22న సినిమా రిలీజ్ కానుంది.  

సోమవారం టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఫన్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.  ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అనే క్యాప్షన్‌‌‌‌తో కంప్లీట్ కామెడీతో టీజర్‌‌‌‌‌‌‌‌ను కట్ చేసిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఏ లాంగ్వేజ్‌‌‌‌లోనైనా ఈ సినిమా తీయొచ్చు. 

ఇలాంటి కాన్సెప్ట్‌‌‌‌తో ఇప్పటివరకు సినిమా రాలేదు. మా పాత్రలకు అందరూ కనెక్ట్ అవుతారు. రెండు గంటలపాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాం. గుప్త నిధులు కథాంశంగా సినిమా సాగుతుంది. చాలా ఫన్నీగా ఉంటుంది’ అని చెప్పాడు.  ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఇందులో నేను భీమ్ క్యారెక్టర్ చేశా. టీజర్, ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’ అని అన్నాడు.  

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ ‘ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. నేను బుష్ పాత్రలో కనిపిస్తా’ అని చెప్పాడు. షూటింగ్‌‌‌‌లో చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది హీరోయిన్ ఆయేషా. అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు.  నటుడు రచ్చ రవి, ఎడిటర్ విజయ్ వర్ధన్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.