మొదటి పెళ్లి రోజు జరుపుకుంటున్న బాలీవుడ్ కపుల్.. పోస్ట్ వైరల్

మొదటి పెళ్లి రోజు జరుపుకుంటున్న బాలీవుడ్ కపుల్.. పోస్ట్ వైరల్

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆలియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వారి పెళ్లి వేడుకలో భాగమైన హల్దీ ఈవెంట్ లో దిగిన ఓ ఫొటోతో పాటు రంగుల రాట్నంలోని ఓ ఫోజ్ ను, గ్రే స్కేల్ పిక్చర్ ను ఆలియా ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీటితో పాటు హ్యాపీ డే అనే క్యాప్షన్ ను ఫొటోలకు జత చేశారు. ఈ ఫొటోల్లోని ఒకదాంట్లో రణబీర్ ఆలియాను కౌగిలించుకుని ఉండగా.. ఇద్దరూ హల్దీ పూసిన ముఖాలతో నవ్వుతూ ఉన్నారు. రెండవ దాంట్లో రణబీర్, ఆలియాకు ప్రపోజ్ చేస్తున్నట్టు.. ఆమె ఓకే చేసినట్టుగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరికీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2022, ఏప్రిల్ 14న కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడా నవంబర్ 6న వారు తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాగా, ఆమెకు రాహా అని పేరు పెట్టారు.

https://www.instagram.com/p/CrAeocZMZJw/?utm_source=ig_embed&ig_rid=8e0e9aac-58b6-4c9f-a0a4-affc57f2d294