రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా జవాన్ ను ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్

రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా జవాన్ ను ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్

 రైలు పట్టాలపై నడవొద్దని అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు డోంట్ కేర్ అంటున్నారు. తరచూ ప్రమాదాల భారిన పడటమే కాదు..ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. హర్యానాలో  ఓ BSF జవాన్ రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా ప్రాణాలను పోగొట్టుకున్నాడు.  ఇటీవల సెలవులపై వచ్చిన జవాన్ వీర్ సింగ్ తన సోదరిని చూసేందుకు మజ్రా ఖుర్ద్ గ్రామం వెళ్తుండగా సమీపంలోని  రైలు పట్టాలను క్రాస్ చేస్తున్నాడు. ఆ సమయంలో  రేవారి వైపు నుంచి వేగంగా వస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహేంద్రగఢ్‌ ఆస్పత్రికి తరలించారు.