తండ్రి మరణం, పరీక్షలో ఫెయిల్.. తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

తండ్రి మరణం, పరీక్షలో ఫెయిల్.. తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బడంగ్ పేట అల్మాస్​గూడ విశాఖ నగర్ కు చెందిన జేరిపేట హర్షిత్ (18) తండ్రి ఇటీవల మృతి చెందాడు. ఆ బాధతో జేఈఈ మెయిన్స్​ క్వాలిఫై కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. మాదాపూర్ లోని ఓ ఇన్​స్టిట్యూట్​లో కోచింగ్ తీసుకుంటున్న హర్షిత్​ శుక్రవారం సాయంత్రం తల్లి ప్రభావతికి ఫోన్ చేసి డిప్రెషన్ తట్టుకోలేకపోతున్నానని చెప్పి  కాల్​ కట్​ చేశాడు. ఆ తరువాత వీఎం హోమ్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.