కేసీఆర్‍ను తిడుతూ  పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు

కేసీఆర్‍ను తిడుతూ  పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు

మామడ (నిర్మల్‍), వెలుగు: సీఎం కేసీఆర్, నిర్మల్​టీఆర్ఎస్ లీడర్ శ్రీహరిరావును తిడుతూ ఫేస్​బుక్​లో వీడియో పోస్ట్​చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్​జిల్లా మామడ మండలం అనంతపేటకు చెందిన ముక్కెర రాజేశ్వర్​ఇటీవల సీఎం కేసీఆర్, స్థానిక టీఆర్ఎస్​ లీడర్​ శ్రీహరిరావుని తిడుతూ వీడియో తీసుకుని తన ఫేస్​బుక్​లో అకౌంట్​లో పోస్ట్​ చేశాడు. దాన్ని చూసిన టీఆర్ఎస్​ లీడర్లు పోలీసులకు కంప్లైంట్​చేశారు. తమ నేతలను తిట్టడమే కాకుండా సోషల్​మీడియాలో వైరల్​ చేశాడని పేర్కొన్నారు. రాజేశ్వర్​ను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని ఎస్సై వినయ్​తెలిపారు. కానిస్టేబుల్​ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కోర్టు14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్​ విధించిందని, నిర్మల్ సబ్ జైల్​కు తరలించినట్లు ఎస్సై వివరించారు.