ఏపీఎస్ ఆర్టీసీలో నెల రోజుల ముందే రిజర్వేషన్

ఏపీఎస్ ఆర్టీసీలో నెల రోజుల ముందే రిజర్వేషన్

అమరావతి: కరోనా అన్ లాక్ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచింది. ఇదే విషయాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 7 రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. తాజా నిర్ణయంతో ఆ గడువు 30 రోజులకు పెంచడం జరిగింది.