సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నల్లగొండ: ఎగువ ప్రాంతాలనుంచి నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు 68వేల 078 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా..4 క్రస్ట్ గేట్లు ఎత్తి 6 లక్షల 77వేల 658 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 

నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులుండగా.. జలాశ యం పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుండగా.. ప్రస్తుతం నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాలనుంచి ఉత్పత్తి కొనసాగుతోంది.