ముంబయి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అరెస్టైన నవనీత్ కౌర్ దంపతులను పరామర్శించేందుకు ఖార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య కారుపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. కారుపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. తనపై శివసేన సైనికులు దాడి చేశారని బాద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శివసైనికులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి