మహబూబ్నగర్లో ఆన్లైన్ యాప్ మోసం..ప్రజల నుంచి 2 కోట్లు వసూల్

మహబూబ్నగర్లో ఆన్లైన్ యాప్ మోసం..ప్రజల నుంచి 2 కోట్లు వసూల్

మహబూబ్నగర్లో భారీ ఆన్ లైన్ యాప్ మోసం బయటపడింది. క్యాటర్ పిల్లర్ అనే యాప్లో రూపాయి పెట్టుబడి పెడితే.. వంద రూపాయల ఇస్తామని నిర్వాహకులు జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒకరిని యాప్కు పరిచయం చేస్తే వారి ఇన్వెస్ట్మెంట్లో 8 శాతం వాటా ఇస్తామని చెప్పి..యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఐడీ నంబర్, పాస్ వర్డ్ ఇచ్చారు. ఈ యాప్లో 600 నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపారు.

ఈ ప్రకటనతో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారం, వస్తువులు, వెహికల్స్ అమ్మి యాప్లో పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా క్యాటర్ పిల్లర్ యాప్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అయితే.. ఈ నెల 8వ తేదీన యాప్ క్లోజ్ అయ్యింది. అప్పటి నుంచి యాప్ ఓపెన్ కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.