AP News: రెండో భద్రాద్రి.. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం.. వార్షిక బ్రహ్మోత్సవాలు..  మార్చి 26న ప్రారంభం.. ఏప్రిల్ 1 న కళ్యాణం..

AP News: రెండో భద్రాద్రి.. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం.. వార్షిక బ్రహ్మోత్సవాలు..  మార్చి 26న ప్రారంభం.. ఏప్రిల్ 1 న కళ్యాణం..

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అంగరంగ వైభవంగా  సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. 

ఒంటిమిట్ట కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 24న  కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు.  మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.  ప్రతిరోజు ఉదయం 7.30  గంటల నుంచి 9 .30గంటల వరకు... సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. 

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు

 

  • మార్చి 27 (శ్రీరామ నవమి):  వృషభ లగ్నంలో ఉదయం 9.30 – 10.15 గంటల మధ్య ధ్వజారోహణం..  ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం.
  • మార్చి 27  సాయంత్రం 7 గంటలకు శేష వాహనం
  • మార్చి 28  : ఉదయం వేణుగాన అలంకారం.. సాయంత్రం  హంస వాహనం
  • మార్చి 29:  ఉదయం  వటపత్రసాయి అలంకారం .. సాయంత్రం సింహ వాహనం
  • మార్చి 30:  ఉదయం   నవనీతకృష్ణ అలంకారం.. సాయంత్రం  హనుమంత వాహనం
  • మార్చి 31:   మోహినీ అలంకారం.. సాయంత్రం  గరుడసేవ
  • ఏప్రిల్ 1 :   ఉదయం శివధనుర్భాణ అలంకారం.. మధ్యాహ్నం 3.15 గంటలకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం.. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం.. రాత్రికి గజవాహనం.
  • ఏప్రిల్ 2 : ఉదయం   రథోత్సవం
  • ఏప్రిల్ 3 :  కాళీయమర్ధన అలంకారం  ...సాయంత్రం అశ్వవాహనం
  • ఏప్రిల్ 4 : చక్రస్నానం.. సాయంత్రం ధ్వజావరోహణం
  • ఏప్రిల్ 5: సాయంత్రం 6 గంటల నుంచి  పుష్పయాగం

►ALSO READ | తిరుమల కొత్త ఈవో ... మద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణం