గ్రామ పంచాయతీల్లో చెత్త తరలింపు కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సర్పంచ్ లకు ఒకటికి రెండుసార్లు అందజేస్తున్నారు. గ్రామాల్లో వివిధ అవసరాల కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆయా ట్రాక్టర్లను కొనుగోలు చేసిన సమయంలో కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్లకు అందజేశారు.
మళ్లీ ఎమ్మెల్యే మెప్పు కోసం కొందరు అధికారులు కూసుమంచి మండలంలో కొనుగోలు చేసిన అన్ని ట్రాక్టర్లను ఎంపీడీవో ఆఫీస్కు రప్పించి తిరిగి సర్పంచ్లకు తాళాలు ఇచ్చారు. ఇప్పటికే నాయకన్ గూడెం, కూసుమంచి, జుఝ్జల్ రావు పేట సహా పలు గ్రామాల్లో చెత్త తరలింపు కోసం వాడుతున్న ట్రాక్టర్లనే మళ్లీ గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. – కూసుమంచి, వెలుగు