- పలుచోట్ల 5 వేల మంది పోలీసుల తనిఖీలు
- పాల్గొన్న సిటీ సీపీ సజ్జనార్
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆపరేషన్ కవాచ్ నిర్వహించారు. నగరంలోని 150 ప్రాంతాల్లో ఏకకాలంలో 5 వేల మంది పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
వాహనాలను తనిఖీ చేసి పేపర్లను పరిశీలించారు. సిటీ సీపీ సజ్జనార్ కొన్ని ప్రాంతాల్లో స్వయంగా పాల్గొని వాహనాలను చెక్ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఏఆర్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి.
