ప్రాజెక్ట్​ టైగర్​

ప్రాజెక్ట్​ టైగర్​

దేశంలో 1973 ఏప్రిల్​ 1న ఆపరేషన్​ టైగర్​ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో మొత్తం 53 టైగర్​ రిజర్వ్​లున్నాయి. కర్ణాటక రాష్ట్రం బందీపూర్​లో దేశంలో తొలి టైగర్​ రిజర్వును ఏర్పాటు చేశారు. చివరగా ఛత్తీస్​గఢ్​లోని గురు ఘాసిదాస్​ జాతీయ పార్కును 53వ టైగర్ రిజర్వ్​గా ప్రకటించారు.  పులుల మనుగడ, వ్యాప్తిని నిర్ధారించే లక్ష్యంతో తెలంగాణలో రెండు పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అమ్రాబాద్​ టైగర్​ ​రిజర్వు నల్లమల కొండ ప్రాంతాల్లో ఉంది.

అంతేకాకుండా మహబూబ్​నగర్​, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 2,611 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కవాల్​ టైగర్​ రిజర్వ్​ మొత్తం 2015 చ.కి.మీ. విస్తీర్ణంలో మహారాష్ట్రలోని ఆడోబా అంధేరి టైగర్​ రిజర్వ్​, ఛత్తీస్​గఢ్​లోని ఇంద్రావతి టైగర్​ రిజర్వ్​కు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. కవాల్​, ఇతర్​ రెండు రిజర్వ్​ల మధ్య పులులు వలస వెళ్లడాన్ని గమనించవచ్చు.