- కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యేందుకు ప్రతిపక్షాలు ఈ నెల 17న భేటీ కానున్నాయి. జులై 17, 18వ తేదీల్లో బెంగళూరు వేదికగా విపక్షాల రెండో మీటింగ్జరగనుందని కాంగ్రెస్తెలిపింది. ఈమేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటించారు. ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించేందుకు తమ ప్రయత్నాలను వేగవంతం చేశామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ వాషింగ్ మెషిన్ ఐసీఈ (ఇన్కం ట్యాక్స్, సీబీఐ, ఈడీ)లతో మళ్లీ స్టార్ట్ అయ్యిందని ఆరోపించారు. జూన్ 23న పాట్నాలో సమావేశమైన విపక్ష నేతలు ఈ రోజు మళ్లీ భేటీ కానున్నారని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.
ముంబై తరహా ఆపరేషన్లు బలోపేతమైతే వాటిని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని ట్వీట్ చేశారు. ‘మోదీ వాషింగ్ పౌడర్’ గా పేర్కొంటూ ప్రధాని ఫొటోతో ఉన్న వాషింగ్ పౌడర్ ప్యాకెట్ను జైరాం రమేశ్ ట్యాగ్చేశారు. కాగా, వేణుగోపాల్ ట్వీట్కు స్పందించిన టీఎంసీ నేత, రాజ్యసభ ఎంపీ ఒబ్రెయిన్ ‘బెంగళూరు సమావేశం. అందరికోసం ఒక్కరు..ఒక్కరికోసం అందరు’ అని బదులిచ్చారు. అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ జులై 13, 14 వ తేదీల్లో విపక్షాల రెండో మీటింగ్ ఉంటుందని ప్రకటించినా, ఆ తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఈ నెల 17కు మార్చారు.