శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినది తెలిసిందే. బెయిల్ పిటిషన్పై కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. కేసు దర్యాప్తు కీలకదశలో ఉందని ఏసీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో శివ బాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని విచారించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ సేకరించాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫు వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే చాన్స్ ఉంది.