ORR వైపు వెళ్లారంటే చుక్కలే.. ఎగ్జిట్ నంబర్ 4లో రెండు గంటలుగా నరకం !

ORR వైపు వెళ్లారంటే చుక్కలే.. ఎగ్జిట్ నంబర్ 4లో రెండు గంటలుగా నరకం !

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 4 నుంచి మల్లంపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శాంబీపూర్ గ్రామం నుంచి మల్లంపేట్ వెళ్ళే దారిలో, పండగకు ఊర్లకు వెళ్లేందుకు వాహనాల కారణంగా రద్దీ పెరిగింది. వాహనాలు పెద్ద సంఖ్యలో రావడంతో టోల్ గేట్ సమీపంలో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రెండు గంటలుగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో తిప్పలు పడ్డారు. 

నార్సింగి సర్వీస్ రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతుండటంతో.. నార్సింగి ఓఆర్ఆర్, సర్వీస్ రోడ్డుపై రాకపోకలు బంద్ అయ్యాయి. జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్కు రికార్డ్ స్థాయిలో వరద రావడంతో గేట్లు ఓపెన్ చేశారు. ఈ కారణంగా నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ జలమయమైపోయింది.

హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లను ఎత్తి  జలమండలి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్ 18 దగ్గర వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాలను, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రాకుండా పోలీసులు, హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకోవడం గమనార్హం. గండిపేట జలాశయం నుంచి మొత్తం 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి వరద నీరును దిగువకు విడుదల చేశారు.