పల్లెమోనికాలనీ ప్రొఫెసర్​కు ఓయూ డాక్టరేట్

పల్లెమోనికాలనీ ప్రొఫెసర్​కు ఓయూ డాక్టరేట్

హన్వాడ,వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా మండలం పల్లెమోనికాలనీ గ్రామానికి చెందిన ఎం. రాజలక్ష్మి ఇంగ్లిష్​ లిటరేచర్​లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఓయూ ఇంగ్లిష్​ డిపార్ట్​మెంట్​ హెడ్​ డాక్టర్ బి.అశోక్ పర్యవేక్షణలో ‘కల్చరల్ నెగోషియేషన్ ఇన్ ది డయాస్పోరిక్ స్పేస్.. ఎ స్టడీ ఆఫ్ ది సెలెక్టెడ్ నావెల్స్ ఆఫ్ ఉమా పరమేశ్వరన్ అండ్ చిత్ర బెనర్జీ దివాకరుని’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేశారు. ప్రస్తుతం డాక్టర్ ఎం.రాజలక్ష్మి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ఇంగ్లిష్​ డిపార్ట్​మెంట్​ హెడ్​గా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎం.రాజలక్ష్మి డాక్టరేట్​ రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.