- చీఫ్ వార్డెన్ను ఆదేశించిన వర్సిటీ వీసీ రవీందర్
- పాముకాటుకు గురైన పీహెచ్డీ స్టూడెంట్కు పరామర్శ
ఓయూ, వెలుగు: పాము కాటుకు గురై గాంధీ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓయూ పీహెచ్డీ స్టూడెంట్ విష్ణును ఉస్మానియా వర్సిటీ అధికారులు గురువారం పరామర్శించారు. వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్తో కలిసి గాంధీకి వెళ్లి విష్ణు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విష్ణుకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు వారు పేర్కొన్నారు. వర్షాలు పడుతున్నందున స్టూడెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
హాస్టళ్లు, మెస్ల పరిసరాలను క్లీన్ చేయించాలని చీఫ్ వార్డెన్ను వీసీ రవీందర్ ఆదేశించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ ఆయా హాస్టళ్లు, మెస్ల కేర్ టేకర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టళ్లు, మెస్ల పరిసరాలను క్లీన్చేయాలని సిబ్బందికి సూచించారు. అవసరమైనచోట లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.