మా ఇల్లు, గుడి కూల్చేస్తమంటున్రు

మా ఇల్లు, గుడి కూల్చేస్తమంటున్రు

ఎర్రమంజిల్ కాలనిలోని ఎల్లమ్మ దేవాలయాన్ని, తమను రక్షించాలని ఎల్లమ్మ దేవాలయ పూజారి దేవరాజు కుటుంబం ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేడుకున్నారు.  నిమ్స్ విస్తరణలో భాగంగా  పాత క్వార్టర్స్ లో  దేవాలయ సంరక్షణ చేస్తున్న తమ ఇల్లు కూల్చివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థరాత్రి తమ వద్దకు వచ్చిన అధికారులు.. ఉదయం కల్లా ఖాళీ చేయాలని చెప్పినట్టు వారు వాపోయారు.ఆరు దశాబ్దాల క్రితం తమ తండ్రి గుడిని స్థాపించారని అప్పట్నుంచి గుడిని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి కూడా గుడికి భక్తులు వస్తారని చెప్పారు. ఆలయంలో శివలింగానికి నిత్యం అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న తమ కుటుంబానికి గుడి ఆవరణలోనే తమకు రెండు గదులు కేటాయించి జీవనం సాగేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు.