న్యూఢిల్లీ : కొత్త ఇన్సాల్వెన్సీ చట్టం (దివాలా చట్టం )అమలులోకి వచ్చాక 12 వేల కేసు లు దాఖలైనట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిం చారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడే దివాలా పిటిషన్ దాఖలు చేయాలని, తమ వద్ద దాఖలైన పిటిషన్లను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ చురుగ్గా పరిష్కరిస్తున్నాయని కార్పొ రేట్ ఎఫైర్స్ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. కొన్ని ఎన్సీఎల్టీలలో దాఖలైన కేసుల సంఖ్యకు సమానంగా పరిష్కారమైన కేసుల సంఖ్య ఉందని పేర్కొ న్నారు. ఎన్సీఎల్టీ అనుమతితోనే ఐబీసీ కింద దివాలా పిటిషన్ దాఖలు చేయడం వీలవుతుంది. వ్యక్తిగత దివాలా విషయంలో కొంత జాగ్రత్తగానే కదలాల్సి ఉంటుందని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సి ఉంటుందని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత దివాలా చాలా ముఖ్యమైన అంశం, వీలైనంత త్వరలో ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపారు.అప్పుల చెల్లింపులో పేదలే బెటరు…దేశంలో ఆహారేతర ఉత్పత్తులకు ఇచ్చిన రుణాలు ప్రస్తుతం రూ. 77 లక్షల కోట్లకు చేరాయని, ఇందులో పరిశ్రమ రంగానికి ఇచ్చినవి రూ. 26 లక్షల కోట్లైతే, సర్వీసెస్ రంగానికి ఇచ్చినవి రూ. 21 లక్షల కోట్లనిచెప్పారు. ఆహారేతర రుణాలలో 70 శాతం ఈరెండు రంగాలకూ ఇచ్చినవేనని పేర్కొ న్నారు. వ్యక్తిగత దివాలా పరిశీలనకు రెండు మార్గాలున్నాయని,బ్యాంక్ రప్టసీ ప్రాసెస్ కింద దివాలా చర్యలు, లేదా కొత్తగా ఒక విధానాన్ని తీసుకురావడమని శ్రీనివాస్ వివరించారు. ఐబీసీ కింద దాఖలైన 4500 కేసు లుపరిష్కారమయ్యా యని, వాటి ద్వారా రూ. 2 లక్షల కోట్ల సెటిల్మెంట్ జరిగిందని తెలిపారు. ఇవి కాకుండా మరో 1500 కేసులను అనుమతిం చారని, మరో 6 వేల కేసు లు క్యూలో ఉన్నాయని తెలిపారు. మొం డిబకాయిల సమస్య పరిష్కారానికి నిర్ధా రిత గడువుతోకూడిన పరిష్కారాన్ని ఐబీసీ అందిస్తోంది. అప్పులుతిరిగి చెల్లిం చడంలో ధనికుల కంటే పేదవారేమెరుగ్గా ఉంటు న్నారని, తి రిగి చెల్లిం చకపోతే తమజీవనోపాథి పోతుందనే ఆలోచన పేదలకు ఉందనిపేర్కొ న్నారు. ఇన్సాల్వెన్సీ కౌ న్సెలర్స్ ఏర్పాటు మంచిఆలోచనని, సమస్య పరిష్కారాన్ని కౌ న్సెల్లర్ చేపట్టే అవకాశం ఉండాలని చెబుతూ, ఈ ఆలోచనను లోతుగా పరిశీలించాలని చెప్పారు.
