ప్రవీణ్ రాజ్ కుమార్ హీరోగా శశికా టిక్కూ, అషు రెడ్డి కీలక పాత్రలలో సంజయ్రెడ్డి బంగారపు దర్శకత్వంలో కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న చిత్రం ‘పద్మవ్యూహంలో చక్రధారి’. ఈ మూవీ టైటిల్ పోస్టర్ను బుధవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్కి అతిథులుగా హాజరైన దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, కృష్ణ చైతన్య సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.
ప్రవీణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ ఉంటుంది. దానిలో కొందరు సక్సెస్ అవుతారు, మరికొందరు ఫెయిల్ అవుతారు. అయితే తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన ఓ వ్యక్తి అక్కడి నుంచి ఎలా బయటికి వచ్చాడనేది కథ’ అని చెప్పాడు. ఇందులో పద్మ అనే పాత్ర పోషిస్తున్నట్టు చెప్పింది అషు రెడ్డి. ఇదొక యూనిక్ స్టోరీ అన్నాడు మధునందన్. సత్య పాత్రలో కనిపిస్తానంది శశికా టిక్కూ. రాయలసీమలో స్వచ్ఛమైన ప్రేమని చూపించబోతున్నాం అన్నాడు దర్శకుడు సంజయ్ రెడ్డి. టీమ్ అంతా పాల్గొన్నారు.