దాయాది దేశం పాక్ కుట్రలు ఆగడం లేదు. బోర్డర్ లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆయుధాలతో పాకిస్థాన్ కి చెందిన డ్రోన్ ను జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లాలో కూల్చివేశారు. దానిని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పరిశీలిస్తోందని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే డ్రోన్ ను కూల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి హరియా చక్ ప్రాంతంలోని సరిహద్దు నుండి డ్రోన్ కదలికను పోలీసులు గుర్తించారు.సెర్చ్ పార్టీ దానిపై కాల్పులు జరిపిందన్నారు. గ్రౌండ్ ఫైర్తో డ్రోన్ను కిందకు దించామని చెప్పారు.
మరిన్ని వివరాల కోసం
2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు
శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం