ODI World Cup 2023:టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పాకిస్థాన్.. ఓడితే నాలుగు జట్లు టోర్నీ నుంచి ఔట్

ODI World Cup 2023:టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పాకిస్థాన్.. ఓడితే నాలుగు జట్లు టోర్నీ నుంచి ఔట్

వరల్డ్ కప్ లో భాగంగా నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగబోతుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి న్యూజీలాండ్ జట్టు ఒత్తిడిలో ఉంటే.. బంగ్లాదేశ్ పై విజయంతో పాక్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు 7 మ్యాచ్ లు ఆడగా.. పాక్ ఖాతాలో 6 పాయింట్లు, కివీస్ ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియంసన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.   


న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (సి), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

Also Read :- టీమిండియాకు బ్యాడ్ న్యూస్


పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), ఇఫ్తీకర్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రవూఫ్