పెషావర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో IED పేలుడు.. ఏడుగురు మృతి

పెషావర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో IED పేలుడు.. ఏడుగురు మృతి

పాకిస్థాన్ పెషావర్‌లోని వార్సాక్ రోడ్‌లో డిసెంబర్ 4న ఉదయం ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థానీ ఇంగ్లీష్ డైలీ, డాన్ కథనం ప్రకారం, ఈ సంఘటన పెషావర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉదయం 9:10 గంటలకు జరిగింది. రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బ్లాక్ లో అమర్చిన నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్థాలను పేలుడుకు ఉపయోగించినట్లు  వార్సాక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్షద్ ఖాన్‌ తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, తదుపరి విచారణ జరుగుతోందని ఖాన్ చెప్పారు.

అందరూ 11 - 23 సంవత్సరాల మధ్య వయస్సు గలవారేనని ఖాన్ పేర్కొన్నాడు. అంతే కాదు పిల్లలెవరూ పాఠశాల యూనిఫాం ధరించలేదని చెప్పారు. ఈ క్రమంలోనే కేర్‌టేకర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి జస్టిస్ (రిటైర్డ్) అర్షద్ హుస్సేన్ షా ఈ ఘటనను ఖండించారు.పేలుడుపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరారు.
                                                                                                                                                     
2014లో, పాకిస్తానీ తాలిబాన్లు.. వాయువ్య నగరం పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS)పై దాడి చేసి 131 మంది విద్యార్థులతో సహా కనీసం 150 మందిని చంపేశారు. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.