హైదరాబాద్‌లో పాకిస్థాన్ టీంకి రాజ వైభోగాలు..'జువెల్ ఆఫ్ నైజాం'లో విందు  

హైదరాబాద్‌లో పాకిస్థాన్ టీంకి రాజ వైభోగాలు..'జువెల్ ఆఫ్ నైజాం'లో విందు  

వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన పాక్ టీం రాయల్ లైఫ్ అనుభవిస్తుంది. ఎయిర్ పోర్ట్ కి దిగగానే పాక్ జెండాలతో ఘన  స్వాగతం, ఖరీదైన హోటల్లో బస, ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు ఇలా బీసీసీఐ పాకిస్థాన్ జట్టుని ఏ లోటు లేకుండా లేకుండా చూసుకుంటుంది. తాజాగా 'జువెల్ ఆఫ్ నైజాం' లో విందు చేస్తూ సరదాగా గడిపారు.
 
'జువెల్ ఆఫ్ నైజాం' స్పెషాలిటీ ఏంటి..?

'జువెల్ ఆఫ్ నైజాం' అనేది హైదరాబాదీ వంటకాలను అందించడానికి ప్రసిద్ధి చెందిన డైనింగ్ రూమ్. ఇది హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో ఉంది. ఆహార ప్రియులకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడానికి ప్రసిద్ధి చెందిన ఈ స్థాపనలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉంది. ఈ రెస్టారెంట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు విలాసవంతమైన విందును ఆస్వాదించడమే కాకుండా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

మరో పది రోజులు హైదరాబాద్ లోనే 

వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా పాకిస్థాన్ టీం మరో పది రోజులు హైదరాబాద్ లోనే  ఉండబోతుంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 3 న ఒక వార్మప్ మ్యాచ్ తో పాటు నెదర్లాండ్స్ తో 6న, శ్రీలంకతో 10న తమ తొలి రెండు ప్రధాన మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులన్నీ ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. కాగా.. మొదటి ప్రాక్టీస్ మ్యాచులో పాక్ 345 పరుగులు కొట్టినా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.