ఇవాళ టీ20 ప్రపంచకప్లో కీలకమ్యాచ్ జరగనుంది. టీమిండియా, జింబాబ్వే చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ సౌతాఫ్రికాతో ఆ జట్టు మ్యాచ్ ఆడనుంది. సిడ్నీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోతే కనుక టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే అవుతుంది. ఒకవేళ గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం గ్రూప్ 2లో 6 పాయింట్లతో టీమిండియా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా. 5 పాయింట్లతో సౌతాఫ్రికా రెండో ప్లేస్ లో ఉంది. పాకిస్తాన్ పై దక్షిణాఫ్రికా గెలిస్తే సెమీస్లో అడుగు పెడుగుతుంది. పాకిస్తాన్ గెలుపొందితే.. సెమీస్ రేసులో కొనసాగుతుంది. భారత్ తన చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడటంతోపాటు.. సౌతాఫ్రికా బంగ్లాదేశ్లపై గెలిస్తే పాక్ సెమీస్ చేరుకుంటుంది.
ఇప్పటివరకు ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టుకు ఒక పాయింట్ లభించింది. ఇందుకు విరుద్దంగా పాక్ ఉంది. ఇండియా, జింబాబ్వే పై ఓడిపోయి.. నెదర్లాండ్స్పై గెలిచింది.