పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగం..ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఘటన

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగం..ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఘటన

తొర్రూరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగం చెందారు. దీంతో ఊరుకో అక్క అంటూ యువ ఎమ్మెల్యేను మహిళలు ఓదార్చారు. తన చేతుల మీదుగా నిరుపేదలకు ఇండ్ల పట్టాలను అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మంగళవారం తొర్రూరు, పెద్ద వంగర, పాలకుర్తి మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్​ పంపిణీ చేశారు.

పెద్దవంగరలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదోళ్ల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో రైతులకు విత్తనాలు అందించారు. తొర్రూరు మున్సిపాలిటీలో రూ.89 లక్షల15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన జేసీబీ, వాటర్  ట్యాంకర్లు, చెత్త సేకరణ వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.