అవతలి పార్టీ నుంచి వచ్చిన.. కుక్కను ఇటేస్తే పిల్లి ఐపోతది : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

అవతలి పార్టీ నుంచి వచ్చిన.. కుక్కను ఇటేస్తే పిల్లి ఐపోతది : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

హనుమకొండ, వెలుగు: కాంగ్రెస్​, టీడీపీ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి చెప్పిన మాటలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఎమ్మెల్యేల గురించి తాను అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్​ఇట్ల అన్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ‘‘నిన్నటి దాకా ఆ పార్టీలో ఉన్నడు.. ఇవ్వాళ వచ్చిండు. మనకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మళ్లీ వాళ్లను తీసుకోవడం ఎందుకు సార్​ అని నేను ముఖ్యమంత్రి కేసీఆర్​ను అడిగిన. ‘వాళ్లు అవతలి వైపు ఉండి కుక్కల్లాగ మాట్లాడుతున్నరు.. ఆ కుక్కనే ఇటేస్తే పిల్లిలాగా ఐపోద్ది కదా..’ అని కేసీఆర్​ అన్నరు” అని పల్లా రాజేశ్వర్​రెడ్డి తెలిపారు. తన సొంతూరు హనుమకొండ జిల్లా వేలేరు మండలం సొడాశపల్లిలో బుధవారం రాత్రి జరిగిన పబ్లిక్​ మీటింగ్​ పల్లా ఈ కామెంట్స్​ చేశారు. చిన్నరాష్ట్రంలో సీట్లు తక్కువగా ఉన్నయ్​ కాబట్టి సుస్థిరత కోసం ఎమ్మెల్యేలను కచ్చితంగా తీసుకోవాల్సి అవసరం ఉంటుందని కేసీఆర్​ అన్నట్లు తెలిపారు.