హనుమకొండ, వెలుగు: కాంగ్రెస్, టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎమ్మెల్యేల గురించి తాను అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ఇట్ల అన్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ‘‘నిన్నటి దాకా ఆ పార్టీలో ఉన్నడు.. ఇవ్వాళ వచ్చిండు. మనకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మళ్లీ వాళ్లను తీసుకోవడం ఎందుకు సార్ అని నేను ముఖ్యమంత్రి కేసీఆర్ను అడిగిన. ‘వాళ్లు అవతలి వైపు ఉండి కుక్కల్లాగ మాట్లాడుతున్నరు.. ఆ కుక్కనే ఇటేస్తే పిల్లిలాగా ఐపోద్ది కదా..’ అని కేసీఆర్ అన్నరు” అని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. తన సొంతూరు హనుమకొండ జిల్లా వేలేరు మండలం సొడాశపల్లిలో బుధవారం రాత్రి జరిగిన పబ్లిక్ మీటింగ్ పల్లా ఈ కామెంట్స్ చేశారు. చిన్నరాష్ట్రంలో సీట్లు తక్కువగా ఉన్నయ్ కాబట్టి సుస్థిరత కోసం ఎమ్మెల్యేలను కచ్చితంగా తీసుకోవాల్సి అవసరం ఉంటుందని కేసీఆర్ అన్నట్లు తెలిపారు.