అన్నిరంగాలను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదే : పాల్వాయి హరీశ్​ బాబు

అన్నిరంగాలను అభివృద్ధి చేసిన ఘనత  బీజేపీదే  : పాల్వాయి హరీశ్​ బాబు

ములుగు, వెంకటాపూర్​ / నర్సంపేట/నల్లబెల్లి/  వెలుగు :  అన్నిరంగాలను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని   సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ బాబు అన్నారు.  బీజేపీ విజయ సంకల్ప యాత్ర గురువారం ములుగు, భూపాలపల్లి,   వరంగల్​  జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించారు.  ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ములుగులో కార్నర్​ మీటింగ్​ ఏర్పాటు చేశారు.  

జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, యాత్ర ఇన్​చార్జి మార్తినేని ధర్మారావులతో కలిసి ఎమ్మెల్యే హరీశ్​ బాబు మాట్లాడారు.  సమ్మక్క, సారలమ్మల పేరుతో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి రూ.900ల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు. 500ల ఏళ్లుగా సాధ్యంకాని అయోధ్యలో బాలరాముని నిర్మాణం పూర్తయిందని,  మహిళలకు 33శాతం చట్టసభల్లో రిజర్వేషన్​ కల్పించిన ఘనత మోదీదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో  యాత్ర సహ ఇన్​చార్జి చాడ శ్రీనివాస్​ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, అసెంబ్లీ ఇన్​చార్జి పి.నరోత్తంరెడ్డి, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణ వేణి నాయక్​, బీజేపీ ఎస్టీమోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్​, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్​ 

పాల్గొన్నారు.