తాగిన మత్తులో కొడుకు చేసిన దారుణం.. చంపేసిన తల్లిదండ్రులు

తాగిన మత్తులో కొడుకు చేసిన దారుణం.. చంపేసిన తల్లిదండ్రులు

తాగిన మైకంలో సొంత తల్లి, చెల్లి మరియు తమ్ముడి భార్యపై అనేకసార్లు అత్యాచారం చేసిన 24 ఏళ్ల వయసున్న వ్యక్తిని అతని కుటుంబ సభ్యులే హతమార్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని డాటియాలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఆ కుటుంబానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డాటియా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గీతా భరద్వాజ్ తెలిపారు. నవంబర్ 12న గోపాల్‌దాస్ కొండ ప్రాంతంలో తమ బృందం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆమె తెలిపారు. అతడు గొంతుకోసి చంపబడ్డాడని పోస్ట్ మార్టమ్ నివేదికలో వెల్లడయ్యింది. అతడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా నమ్మలేని నిజాలు తెలిశాయని ఆమె అన్నారు. మద్యం మత్తులో తల్లి, చెల్లి, మరియు తమ్ముడి భార్యపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే వారందరూ కలిసి అతన్ని చంపినట్లు ఒప్పుకున్నారని ఆమె తెలిపారు.

తమ కొడుకు మద్యానికి బానిసయ్యాడని మృతుని తల్లిదండ్రులు తెలిపారు. నవంబర్ 11న మద్యం తాగి ఇంటికి వచ్చి తమ్ముడి భార్యపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని మృతుడి తండ్రి చెప్పాడు. తాగొచ్చి తన కొడుకు గతంలో చాలాసార్లు ఇలా చేశాడని.. అందుకే అతని ప్రవర్తనతో విసుగు చెందిన మేము అతన్ని చంపి.. మృతదేహాన్ని గోపాల్‌దాస్ కొండ దగ్గర పడేశామని అతని తండ్రి ఒప్పుకున్నాడు. ఈ హత్యకు పాల్పడిన తండ్రి, భార్య, చిన్న కొడుకు, చిన్న కొడుకు భార్యను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితులని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.