ఎమ్మెల్యే ఇంటిముందు ఉద్రిక్తత.. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్

ఎమ్మెల్యే ఇంటిముందు ఉద్రిక్తత.. రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అంగన్వాడీ ఉద్యోగులు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న అంగన్వాడీలు.. ఇంటి గేటు ముందు బైటాయించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. 

తమను రెగ్యులరైజ్ చేసి.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీ ఉద్యోగులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. 

గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందించడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు.